వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..’జ్ఞాన సరస్వతి’గా నారసింహుడు!

Updated on: Mar 03, 2026 | 5:59 PM

శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రక క్షేత్రం కదిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన సోమవారం, స్వామివారు హంసవాహనంపై జ్ఞాన సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లకు వేద పండితులు శాస్త్రోక్తంగా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

అనంతరం పరిమళ భరితమైన వివిధ రకాల పుష్పాలతో నారసింహుడిని సరస్వతీ దేవి రూపంలో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారి తిరువీధి ఉత్సవం కనుల పండువగా సాగింది. భక్తులు తమ ఇంటి ముంగిట స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిగీతాల ఆలాపనతో కదిరి పురవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగాయి.బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు అత్యంత శక్తివంతమైన సింహ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి, పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ మరియు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వరుస వాహన సేవలతో కదిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

మరిన్ని వీడియోల కోసం :

రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?

అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్

మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ

Follow Us