పొలం పనుల్లో కూలీలు బిజీ.. అంతలోనే చిరుత
అడవుల్లో ఆహారం నీళ్లు దొరక్కపోవడంతో క్రూర మృగాలు పంట పొలాలు, జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో అవి పశువులు, మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లాలో ఓ చిరుతపులి జనాలను పరుగులు పెట్టించింది. పొలాల్లోకి ప్రవేశించి అక్కడ పనిచేస్తున్నవారిపై దాడి చేసింది.
అక్టోబరు 20న ఉనా జిల్లాలోని ఓ గ్రామంలో రైతులు, కూలీలు పొలంలో పనులు చేసుకుంటున్నారు. ఇంతలో ఓ చిరుత పొలాల్లోకి చొరబడింది. దానిని గమనించకుండా కూలీలు తమ పనిలో ఉండగా, అక్కడున్న పొలంలో నక్కిన చిరుత.. అదును చూసి దాడి చేసేందుకు రెడీ అయింది. అయితే.. ఓ కూలీ దానిని గమనించి బిగ్గరగా కేకలు వేయటంతో పొలంలోని మిగతా కూలీలు అలర్ట్ అయి.. గ్రామం దిశగా పరుగులు తీశారు. ఈ క్రమంలో చిరుత వారిపై దాడి చేయగా.. ముగ్గురు గాయపడ్డారు. ఈ లోగా వారి అరుపులు విని గ్రామస్తులు కర్రలు, రాళ్లు పట్టుకుని ఎదురొచ్చి.. చిరుతపై ఎదురుదాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన చిరుత.. పొలాల్లో నుంచి తప్పించుకుని గ్రామశివారులోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. వెంటనే గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది ట్రాంక్విలైజర్ డార్ట్ను ఉపయోగించి, చిరుత స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత దాన్ని బోనులో ఉంచి వన్యప్రాణుల చికిత్స కేంద్రానికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది. చిరుత దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణలో రాకాసి ఏనుగు శిలాజం.. బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రదర్శన
Cyclone Alert: తరుముకొస్తున్న తుఫాన్.. తీరం దాటేది అక్కడే
దహాడీ వేడుకల్లో.. వాతల వైద్యం ఒక్క చురుకుతో.. ఏ రోగమైనా పరార్
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?

