సెల్ఫీ పిచ్చి ఎంత పని చేసింది.. ఎందుకు స్వామి వీళ్ళు ఇలా అయిపోతున్నారు

Updated on: Aug 02, 2025 | 11:35 AM

సెల్ఫీ పిచ్చి ఓ కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టింది. సెల్ఫీ తీసుకునే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం జార్ఖండ్‌లోని భటిండా జలపాతం సందర్శనకు వెళ్లింది. అక్కడ జలపాతం వద్ద సెల్ఫీ తీసుకునే క్రమంలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడిపోయింది.

దీంతో, అప్రమత్తమైన భర్త, పిల్లలు ఆమెను రక్షించేందుకు వెంటనే నీటిలోకి దూకేశారు. జలపాతం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నలుగురూ మునిగిపోయి కొట్టుకుపోయారు. అయితే, అక్కడి స్థానికులు దీనిని గమనించి, అధికారులకు సమాచారమిచ్చారు. వారు అక్కడి మత్స్యకారులు, గజ ఈతగాళ్లను రంగంలోకి దించటంతో వారు దిగువ ప్రాంతానికి వెళ్లి.. ఆ నలుగురినీ గుర్తించి కాపాడారు. ప్రస్తుతం వారంతా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: బాలయ్య సినిమాకు నేషనల్ అవార్డ్‌ | VD కెరీర్లోనే దిమ్మతిరిగే కలెక్షన్స్

ఏడాది ఆదాయం 3 రూపాయలే.. దేశంలోనే నిరుపేద వ్యక్తి ఇతడే

Kingdom: కింగ్డమ్‌కు అదిరిపోయే కలెక్షన్స్‌.. వెంకన్న సాక్షిగా కొట్టిపడేసిన కొండన్న!

Chethabadi: వణికిస్తున్న చేతబడి మోషన్ పోస్టర్‌.. ఏంట్రా బాబోయ్ ఇలా ఉంది