శరీరమంతా రాముని పచ్చబొట్టు వేసుకున్న వారిని ఎప్పుడైనా చూశారా !!

|

Jan 23, 2024 | 10:44 AM

భారతదేశం అనేక గిరిజన తెగలకు నెలవు. ఈ ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన గిరిజన తెగ అయిన రామ-నామిలు. వీరు మహానది ఒడ్డున ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నారు. రామ-నామి తెగ ప్రత్యేకతతో పాటు ఓ విశిష్టత ఉంది. ఈ తెగలోని ప్రతి ఒక్కరు తమ శరీరంలోని ప్రతి భాగంలోనూ శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు.

భారతదేశం అనేక గిరిజన తెగలకు నెలవు. ఈ ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన గిరిజన తెగ అయిన రామ-నామిలు. వీరు మహానది ఒడ్డున ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నారు. రామ-నామి తెగ ప్రత్యేకతతో పాటు ఓ విశిష్టత ఉంది. ఈ తెగలోని ప్రతి ఒక్కరు తమ శరీరంలోని ప్రతి భాగంలోనూ శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఈ తెగవారిని శ్రీరాముని ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఒక పెద్ద తన వంటిపై శ్రీరాముడి పేరును నుదిటిపై పచ్చబొట్టు వేసుకుని తమ నుంచి రాముడిని వేరు చేయలేరని చెప్పారట. అప్పటి నుంచి ఈ సంప్రదాయం నేటికీ పాటిస్తున్నారు. గిరిజన తెగకు చెందిన పరశురామ్ భరద్వాజ్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడని చరిత్ర చెబుతోంది. పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలోని చర్పారా గ్రామంలో జన్మించాడు. చిన్నతనంలో రామాయణ కథల నుంచి ఎంతో స్ఫూర్తి పొందారు. అయితే పరశురాముడు కుష్టు వ్యాధి బారిన పడ్డాడు. ఒక సాధువు ఇచ్చిన సలహాతో రామాయణం పఠించడం ప్రారంభించాడట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పురుషుడిగా మారి బిడ్డకు జన్మనిచ్చిన కానిస్టేబుల్

Follow us on