కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు
మనుషుల్లో కనుమరుగవుతున్న మానవత్వం జంతువుల్లో కనిపిస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల కాలంలో పక్కింటి వాడికి ఆపద వచ్చి అలోమని ఏడుస్తున్నా పక్కనుంచి వెళ్లిపోయేవాళ్లే కానీ.. ఆప్యాయంగా పలకరించి ఓదార్చే వాళ్లే కరువైపోతున్నారు. కానీ, ప్రమాదంలో తన బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న తల్లిని ఓ మూగజీవి ఓదార్చి, కన్నీళ్ళు తుడిచింది.
నీ బిడ్డ అల్లరిని నాలో చూసుకో అన్నట్టుగా చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. శివరాత్రి రోజున తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ధ గోదావరిలో కొందరు యువకులు పుణ్యస్నానానికి వెళ్లారు. అయితే నీటి ప్రవాహంలో వారు గల్లంతయ్యారు. ఈ ఘటనలో తిరుమల శెట్టి పవన్ , పడాల దుర్గాప్రసాద్ , అనిశెట్టి పవన్, గర్రె ఆకాష్ , పడాల సాయి మృత్యు వాత పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు మృతి చెందటంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగి పోయాయి. ఈ ఐదుగురు యువకులకు వారి కుటుంబ సభ్యులు మార్చి 8న పెద్దకార్యం నిర్వహించారు. ఈ సమయంలో అనిసెట్టి పవన్ ఇంటికి ఓ కొండ ముచ్చు వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ పెడుతుంది అంతే..