‘ఇంకా మూడు రోజులే’.. వంగా వాణి నిజమైతే ?? బాబోయ్
జపాన్ను జూలై 5 వ తేదీన ఒక వినాశకరమైన భూకంపం నేలమట్టం చేయబోతోందంటూ బాబా వంగా చెప్పిన మాట.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. తన "ది ఫ్యూచర్ ఐ సా" పుస్తకంలో ఈ విషయాన్ని స్పష్టంగా తేదీతో సహా ఆమె ప్రస్తావించారు. ఈ విపత్తు కారణంగా ప్రపంచంలో పెను మార్పులు రావొచ్చని తెలిపారు.
జపాన్ – ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన.. లేదా, అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఈ భారీ విపత్తు సంభవించొచ్చని, దీని తీవ్రత 2011లో వచ్చిన భూకంప తీవ్రత కంటే.. మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆమె సూచించారు. దీంతో, మరో 3 రోజుల్లో ఆ ప్రమాదం జరుగుతుందనే భయంలో జపనీయులు వణికిపోతున్నారు. ‘బాబా వంగా’గా పేరొందిన జపాన్ జ్యోతిష్యురాలు రియో టత్సుకి భవిష్యవాణి గతంలో చాలాసార్లు నిజమైంది. 2011లో టొహోకు భూకంపం, ప్రిన్సెస్ డయానా, ఫ్రెడ్డీ మెర్క్యురీల మరణం, కొవిడ్-19 మహమ్మారి గురించి ఆమె ముందే హెచ్చరించారు. ఈ క్రమంలో జూలై 5న జపాన్లో విలయం రాబోతోందని చెప్పడంతో.. ప్రపంచ పర్యాటకులు జపాన్ సందర్శనను రద్దు చేసుకుంటున్నారు. కొందరు ఇప్పటికే తాము రిజర్వ్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకున్నారు. హాంకాంగ్ – జపాన్ విమాన టికెట్ల రిజర్వేషన్లు 70 శాతం పడిపోయాయి. ఒకవేళ.. ఈ అంచనాలు నిజమైతే ఇది మానవ చరిత్రలో అతిపెద్ద విషాదం కావచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేసవిలో వెంకన్న హుండీకి రికార్డు ఆదాయం
పెళ్లైన పక్షం రోజులకే.. అత్తతో అల్లుడు జంప్.. అదే కదా మ్యాజిక్
టూ వీలర్ కొంటున్నారా.. ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే
జాలర్ల వలలో చిక్కిన అసలు సిసలైన చేప.. అబ్బా అదృష్టం ఆంటే ఇతనిదే
Samantha: తనతో మాట్లాడుతుంటే సమయమే తెలియదు.. అసలు నిజం బయటపెట్టిన సమంత
వణికిస్తున్న వన్యప్రాణులు..కామారెడ్డిలో చిరుత .. భద్రాద్రిలో పులి
టప టపా పేలిపోయిన సెల్ ఫోన్లు!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు!
చిట్టీల పేరుతో కుచ్చుటోపీ.. కోట్లు దండుకొని పరార్!
17 ఏళ్ళ తరువాత పెద్దమ్మ తల్లి దేవర ... కళ్ళు చెదిరే దృశ్యం
మావోయిస్టు ఉద్యమానికి మనుగడ లేదు
హలీం ధరకు రెక్కలు..సింగిల్ ప్లేట్ ఏకంగా..

