Anand Mahindra: సంతోషమనే ఫ్యాక్టరీకి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదంటూ.. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌..(వీడియో)

|

Jan 26, 2022 | 9:39 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర వ్యాపార పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో పలురకాల ట్వీట్లు చేస్తూ నెటిజన్లలో ఆసక్తిని కలిగించడమే కాదు వారికి దిశానిర్దేశం చేస్తుంటారు.


ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర వ్యాపార పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో పలురకాల ట్వీట్లు చేస్తూ నెటిజన్లలో ఆసక్తిని కలిగించడమే కాదు వారికి దిశానిర్దేశం చేస్తుంటారు. తాజాగా క్రిస్మస్‌ సందర్భంగా మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. క్రిస్మస్‌ సందర్భంగా ఒక అద్భుతమైన వీడియోతో అందరికీ శుభాకాంక్షలందించారు. లక్షల పదాలకంటే ఈ వీడియో ఎంతో విలువైంది అంటూ ఒక వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. తమకున్న దానితో సృజనాత్మకంగా పిల్లలంతా పండుగనుఎంజాయ్‌ చేస్తున్న ఈ ఆసక్తికరమైన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.క్రిస్మస్‌ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్‌ సోదరులు ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో కొంతమంది చిన్నారులు క్రిస్మస్‌ను ఎంతో చక్కగా ఎంజాయ్‌ చేస్తున్నారు. రెండు కర్రలను నేలలో పాతి.. వాటికి ఒక ఖాళీ వాటర్‌ బాటిల్‌ను అమర్చి అదొక మైక్‌లాగా సెట్‌ చేసుకొని ఒక బాలుడు పాట పాడుతుంటే మరికొందరు చిన్నారులు పరవశంతో డాన్స్‌ చేస్తున్నారు. మరో బాలుడు ఓ కర్రను వయొలిన్‌గా చేసుకొని వాయిస్తుంటే.. ఇంకో బాలుడు డస్ట్‌బిన్‌లాంటి టబ్‌లను బోర్లించి వాటిని డ్రమ్స్‌గా వాయిస్తున్నాడు.. మరో కుర్రాడు ఒక రాయిలాంటి బల్లపైన నల్లటి గీతలు గీసి ఉన్నాయి.. దానిని కీబోర్డుగా వాయిస్తున్నాడు.. ఆహా ఏమిక్రియేటివిటీ… ఇంతకుమించిన ఆనందం ఇంకేముంటుంది.. అంటూ కల్మషం లేని ఆ చిన్నారులు తమకున్న వనరులతో అత్యంత ఉత్సాహంగా క్రిస్మస్‌ పండుగ జరుపుకుంటున్న వీడియోను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు. సంతోషమనే ఫ్యాక్టరీకి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలంటూ క్యాప్షన్‌ పెట్టారు. దీనిపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవడమే కాదు.. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Follow us on