గుంతలు పూడ్చాలని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించకపోవడంతో ఓ దివ్యాంగుడు తానే స్వయంగా నడుం బిగించాడు. తనకు వచ్చే పెన్షన్ పైసలతోనే గుంతలను పూడ్పించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన తోట సత్యనారాయణ 12వ వార్డులో నివాసం ఉంటున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలమయంగా మారింది. రాకపోకలు సాగించలేక స్థానికులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దీంతో వాటిని పూడ్చివేయాలని స్థానికలు మున్సిపల్ ఆధికారులను కోరారు. ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో గుంతలను పూడ్పించాడు సత్యనారాయణ. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్లోనే..
Pizza: మార్కెట్లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..