Viral: ఏడాదిగా తల్లి మృతదేహంవద్దే అక్కాచెల్లెళ్లు.. ఏం జరిగిందంటే..?

|

Dec 02, 2023 | 12:25 PM

మరణించిన తల్లి మృతదేహం వద్దే అక్కాచెల్లెళ్లు ఏడాదిగా నివసించారు. వారం రోజులుగా వారు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో... గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లంక ప్రాంతమైన సమేంఘట్‌లోని మదర్వాలో నివాసిస్తున్న 52 ఏళ్ల ఉషా త్రిపాఠి అనారోగ్యంతో గత ఏడాది డిసెంబర్‌లో మరణించింది. ఆమె భర్త రెండేళ్ల కిందటే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

మరణించిన తల్లి మృతదేహం వద్దే అక్కాచెల్లెళ్లు ఏడాదిగా నివసించారు. వారం రోజులుగా వారు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో… గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లంక ప్రాంతమైన సమేంఘట్‌లోని మదర్వాలో నివాసిస్తున్న 52 ఏళ్ల ఉషా త్రిపాఠి అనారోగ్యంతో గత ఏడాది డిసెంబర్‌లో మరణించింది. ఆమె భర్త రెండేళ్ల కిందటే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఉషాత్రిపాఠికి ఇద్దరు కుమార్తెలు. 27 ఏళ్ల పల్లవి త్రిపాఠి, 18 ఏళ్ల వైష్విక్ త్రిపాఠి. కాగా తల్లి చనిపోయినా ఈ అక్కాచెల్లెళ్లు తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. తల్లి మృతదేహాన్ని ఒక గదిలో ఉంచారు. ఈ క్రమంలో ఆ మృతదేహం శిథిలమైపోయింది. ఈ పరిస్థితుల్లో తల్లి శవం పక్కనే ఏడాదిగా వారు నివసిస్తున్నారు. కాగా, అక్కాచెల్లెళ్లు గత వారం రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేదు. వారి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. అది గమనించిన స్థానికులు ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. శిథిలావస్థకు చేరిన తల్లి మృతదేహం వద్ద పల్లవి, వైష్విక్ కూర్చొని ఉండటాన్ని గమనించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us on