Crime: దిగంబర ముఠా అరాచకాలు.. గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ..
ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో దిగంబర ముఠా మహిళలపై దాడులు చేస్తోంది. గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక దాడులు జరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం ...
ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో దిగంబర ముఠా మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. గ్రామస్థుల చెబుతున్న వివరాల ప్రకారం, ఈ ముఠా గత కొన్ని రోజులుగా నగ్నంగా తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులకు పాల్పడుతోంది. భారాల గ్రామంలో ఒక మహిళను పొలాల్లోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నించిన సంఘటన ఇటీవల జరిగింది. బాధితురాలు కేకలు వేయడంతో ముఠా పారిపోయింది. ఇదే విధంగా ఇతర దాడులు కూడా జరిగాయని గ్రామస్థులు తెలిపారు. ముగ్గురు మహిళలు ఇలాంటి దాడులను ఎదుర్కొన్నప్పటికీ, భయం, అవమానంతో బయటకు చెప్పలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో గాలిలో చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Follow Us
వైరల్ వీడియోలు
పోయిన బంగారంతో వస్తేనే ఇంట్లోకి రానిస్తా
మహిమల చెంబు.. మీ ఇంట ఉంటే సిరుల పంటే.. ఆలసించిన ఆశాభంగం
క్యాన్సర్ను ఎదిరించి.. CBSE టెన్త్లో టాపర్గా నిలిచి..
రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్ ప్లాన్ అదిరిందిగా
ఒక్కరోజు వయసున్న క్యూట్ 'రైనో'.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో
ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా
పెట్రోల్ బంకుల్లో ఎయిర్ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్

