తిరుమల డిసెంబర్ కోటా టిక్కెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలంటే
తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించిన టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తుల సౌకర్యార్థం డిసెంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. వీటి ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోసం 20న ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ టోకెన్లను ఇదే విధానంలో నమోదు చేసుకున్నాక ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేస్తారు.
లక్కీడిప్లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. 22న ఉదయం పది గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. 24న ఉదయం పదింటికి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం మూడింటికి అద్దె గదుల బుకింగ్ కోటా అందుబాటులో ఉంటుంది. భక్తులు టీటీడీ దేవస్థానం అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఆర్జితసేవలు, సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇప్పట్లో ఆగేలా లేదుగా
కంట్లో కారం కొట్టి 6 తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన మహిళ
ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కార్
