Viral Video: ఎంతకు తెగించార్రా.. దొంగలు ఏం దొబ్బేశారో తెలిస్తే బిత్తరపోతారు..
డబ్బులు, బంగారం, గోల్డ్.. లేదా ఇంకా ఏదైనా కాస్ట్లీ వస్తువులను దొంగలు దొబ్బేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఓ ఇద్దరు దొంగలు మాత్రం ఏం దొంగలించారో తెలిస్తే.. మీ మైండ్ దొబ్బడం ఖాయం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక వింత సంఘటన వెలుగు చూసింది. ఓ ఇద్దరు దొంగలు రాత్రి వేళలో దొంగతనానికి వచ్చారు. దొంగతనానికి వచ్చిన ఆ ఇద్దరు.. డ్రెయిన్పై కప్పి ఉంచిన ఇనుప మూతను ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం తతంగం అంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు కావడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోను తీక్షణంగా చూస్తే.. ఇద్దరు వ్యక్తులు డ్రెయిన్ మూతను ఎత్తుతున్నట్టు మీరు చూడవచ్చు. ఇక ఇంతలో మరొక వ్యక్తి ఈ-రిక్షాలో వచ్చి.. ఆ ఇద్దరు దొంగలకు సాయం చేశాడు. ఇద్దరు దొంగలు ఇనుప మూతను రిక్షాలో ఎక్కించగా.. అక్కడి నుంచి ముగ్గురు దెబ్బకు పరార్ అయ్యారు. ఆగష్టు 2న అర్ధరాత్రి వేళ స్థానిక గ్యాస్ ఏజెన్సీ సమీపంలోని లాల్ కువాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

