Viral Video: ఎంతకు తెగించార్రా.. దొంగలు ఏం దొబ్బేశారో తెలిస్తే బిత్తరపోతారు..
డబ్బులు, బంగారం, గోల్డ్.. లేదా ఇంకా ఏదైనా కాస్ట్లీ వస్తువులను దొంగలు దొబ్బేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఓ ఇద్దరు దొంగలు మాత్రం ఏం దొంగలించారో తెలిస్తే.. మీ మైండ్ దొబ్బడం ఖాయం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక వింత సంఘటన వెలుగు చూసింది. ఓ ఇద్దరు దొంగలు రాత్రి వేళలో దొంగతనానికి వచ్చారు. దొంగతనానికి వచ్చిన ఆ ఇద్దరు.. డ్రెయిన్పై కప్పి ఉంచిన ఇనుప మూతను ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం తతంగం అంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు కావడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోను తీక్షణంగా చూస్తే.. ఇద్దరు వ్యక్తులు డ్రెయిన్ మూతను ఎత్తుతున్నట్టు మీరు చూడవచ్చు. ఇక ఇంతలో మరొక వ్యక్తి ఈ-రిక్షాలో వచ్చి.. ఆ ఇద్దరు దొంగలకు సాయం చేశాడు. ఇద్దరు దొంగలు ఇనుప మూతను రిక్షాలో ఎక్కించగా.. అక్కడి నుంచి ముగ్గురు దెబ్బకు పరార్ అయ్యారు. ఆగష్టు 2న అర్ధరాత్రి వేళ స్థానిక గ్యాస్ ఏజెన్సీ సమీపంలోని లాల్ కువాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

