సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ

Updated on: Sep 25, 2025 | 8:19 PM

తెలంగాణలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా, సృష్టి స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. డాక్టర్ నమ్రతపై 2019 నుండి అనేక కేసులు నమోదయ్యాయి. సరోగసి పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించడం తెలంగాణలో సంచలనం సృష్టించింది. తెలంగాణ పోలీసులు ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. సృష్టి స్కామ్‌లో మనీలాండరింగ్ కోణం బయటపడటంతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. 2019 నుండి డాక్టర్ నమ్రతపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆమె సరోగసి పేరుతో రూ.11 లక్షల నుండి రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా సంపాదించిన డబ్బును వివిధ చోట్ల పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేపట్టింది. త్వరలోనే డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకొని ఆమె లావాదేవీలపై ప్రశ్నించనుంది ఈడీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad: మియాపూర్ డీ అడిక్షన్ సెంటర్ లో ఓవ్యక్తి దారుణ హత్య

మాదాపూర్ లో డేటింగ్ యాప్ ద్వారా చీటింగ్

Nirmal: బాసర దగ్గర మహోగ్రరూపం దాల్చిన గోదావరి

కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభం

రేపటి నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

Loading...
Unable to load recommendations.
Follow Us