ఫస్ట్ టైమ్ రైలు పై నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

Updated on: Sep 25, 2025 | 8:57 PM

భారత రక్షణ శాఖ తొలిసారిగా రైలు పై నుంచి అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. 2000 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ఈ క్షిపణి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించబడింది. రైలు మార్గాల ద్వారా వేగవంతమైన మరియు సమర్థవంతమైన మోహనం సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

భారతదేశం రక్షణ రంగంలో మరో ముందడుగు వేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన ప్రకారం, తొలిసారిగా రైలు పై నుంచి అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని కలిగి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఈ నూతన సాంకేతికత వలన క్షిపణిని వేగంగా మరియు సులభంగా ఏ ప్రాంతానికైనా తరలించి ప్రయోగించే అవకాశం ఉంది. అతి తక్కువ సమయంలో ప్రతిస్పందన సమర్థతను పెంచుకోవడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అగ్ని ప్రైమ్ క్షిపణిలో జిపిఎస్ మరియు నావిక్ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షారూఖ్ ఫ్యామిలీపై మాజీ NCB అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం దావా

OG టికెట్‌ ధరల పెంపుపై స్టే శుక్రవారం వరకు తొలగింపు

దక్షిణ కొరియా లో విశాఖ LG పాలిమర్స్ బాధితుల ఆందోళన

సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ

Hyderabad: మియాపూర్ డీ అడిక్షన్ సెంటర్ లో ఓవ్యక్తి దారుణ హత్య