దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం..తిరుపతికి 52 ప్రత్యేక రైళ్లు వీడియో

Updated on: Sep 14, 2025 | 4:57 PM

తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు గుడ్‌ న్యూస్‌. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు సెప్టెంబరు 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వివిధ మార్గాల్లో మొత్తం 52 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రత్యేక సర్వీసులు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం… విశాఖపట్నం-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విశాఖపట్నం-తిరుపతి స్పెషల్ ట్రైన్ ఈ నెల 15 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అదే విధంగా, తిరుపతి-విశాఖపట్నం రైలును ఈ నెల 16 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం నడపనున్నట్లు వివరించారు. ఈ మార్గంలో మొత్తం 22 సర్వీసులు నడుస్తాయి. ఇక, తిరుపతి-అనకాపల్లి-తిరుపతి మధ్య అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 27 వరకు మొత్తం 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, సంబల్‌పూర్-ఇరోడ్ మధ్య కూడా రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. సంబల్‌పూర్ నుంచి ఇరోడ్ వెళ్లే రైలు సెప్టెంబరు 17 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో ఇరోడ్-సంబల్‌పూర్ రైలు సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శుక్రవారం సర్వీసు అందిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కూడా మొత్తం 22 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

మరిన్ని వీడియోల కోసం :

దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో

టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో

153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో