Kadapa: తెల్లారి కల్లాపి జల్లుతూ బిత్తరపోయిన మహిళ.. ఎదురుగా కనిపించింది చూడగా

Updated on: Jan 17, 2025 | 1:33 PM

ఉదయాన్నే కల్లాపి జల్లుతున్న ఓ మహిళ ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి దెబ్బకు బిత్తరపోయింది. ఆ సీన్ చూడగానే దెబ్బకు వణికిపోయింది. ఇదేంటి ఇక్కడ ఎవరు ఇలా చేశారు అని అనుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు

కడప జిల్లా బద్వేల్‌లో క్షుద్ర పూజల కలకలం రేపాయి. ఐలమ్మ కాలనీలోని నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ముగ్గు వేసి వాటి మధ్యలో పసుపు కుంకుమ మిరపకాయలు నిమ్మకాయలు ఉండడంతో కాలనీ వాసులలో భయాందోళన నెలకొన్నాయి. ఎవరి మీద అయినా చేతబడి చేశారా అని కాలనీ వాసులు గుబులు చెందుతున్నారు.‌‌ కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాలనీవాసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us