రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవితవ్వంపై కొన్ని రోజులుగా పలు చర్చలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మంగళవారం రాజగోపాల్ రెడ్డి ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అయితే, దీనిపై పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.