తెలంగాణాలో హీట్ పుట్టిస్తున్న రాజ్యసభ ఎన్నికలు
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కాంగ్రెస్ ఇప్పటికే సింగ్వికి ఒక సీటు ఖరారు చేయగా, రెండో స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. విప్ జారీతో ఫిరాయింపు ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సందడి నెలకొంది.
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ఒక స్థానాన్ని అభిషేక్ మను సింగ్వికి కేటాయించిన కాంగ్రెస్, రెండో స్థానానికి అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పోటీపై సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీలో 37 మంది సభ్యులున్న బీఆర్ఎస్, ఫిరాయింపు ఎమ్మెల్యేల కారణంగా 27 మందికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ విప్ జారీ చేయడం ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చెక్ పెట్టాలని చూస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??
గండిపేటలో మహేష్, రాజమౌళి వారణాసి షూటింగ్
Rashmika-Vijay: రూల్ బ్రేక్ చేసిన విరోష్.. రిసెప్షన్కి అంతా రెడీ
Charan-Dhanush: చెర్రీ – ధనుష్ పోటీ.. రూరల్లో నెగ్గేదెవరు ??