రైతులకు సరిపడా యూరియా సప్లై కోసమే యాప్ వీడియో
తెలంగాణలో యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రైతాంగానికి తక్కువగా వస్తున్న యూరియాను సమర్థవంతంగా పంపిణీ చేసేందుకే యాప్ను ప్రవేశపెట్టామని, ఇది రైతులను ఇబ్బంది పెట్టేందుకు కాదని ఆయన తెలిపారు. సమాన పంపిణీకి యాప్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో యూరియా, ఇతర ఎరువుల సరఫరాకు సంబంధించి కీలక అంశాలపై రాష్ట్ర ఐటీ, పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టత ఇచ్చారు. యూరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతులు సహా మొత్తం వ్యవహారం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని ఆయన వివరించారు. రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా కాకపోవడం, తక్కువగా అందుబాటులో ఉండడం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :