BJP: బనకచర్లపై ఎప్పటికైనా BJP స్టాండ్ ఇదే.. తెలంగాణ బీజేపీ చీఫ్ మనసులోని మాట..

Updated on: Aug 04, 2025 | 9:15 AM

తెలంగాణకు నష్టమయ్యే ఏ ప్రాజెక్టునూ మేం ఒప్పుకోం. బనకచర్ల అంశాన్ని బీజేపీపైకి తోయడం కరెక్టు కాదు. బనకచర్లపై రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు చర్చించట్లేదు. ఆనాడు కృష్ణాలో 299టీఎంసీల నీటి ఒప్పందానికి KCR ఒప్పుకున్నారు. ఇప్పుడు సెంటిమెంట్‌ను కాంగ్రెస్ వాడుకోవాలనుకుంటోంది. అని తెలంగాణ బీజేపీ చీఫ్ పేర్కొన్నారు.

కాళేశ్వరం‌ ప్రాజెక్ట్‌పై టీవీ9 క్రాస్‌ఫైర్‌ ప్రొగ్రామ్‌లో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ముందు నుంచి చెబుతూనే ఉన్నామన్నారు రాంచందర్‌రావు. బనకచర్ల అంశాన్ని బీజేపీపైకి నెట్టడం కరెక్ట్‌ కాదన్నారు రామచంద్రరావు. తెలంగాణకు నష్టం చేసే ఏ ప్రాజెక్ట్‌నూ బీజేపీ ఒప్పుకోదని స్పష్టం చేశారు. మరిన్ని విషయాలు ఈ వీడియోలో చూసేయండి.

ఇది చదవండి: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి