Andhrapradesh: 99 పైసలకే కంపెనీలకు భూములు..మండలిలో మాటల మంటలు

Updated on: Feb 12, 2026 | 9:47 PM

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 99 పైసలకు భూముల కేటాయింపుల అంశంపై తీవ్ర చర్చ జరిగింది. నారా లోకేష్, మంత్రి కళ్యాణి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రహేజా కార్ప్‌కు 27 ఎకరాల భూమిని 99 పైసలకే కేటాయించారని లోకేష్ ఆరోపించగా, మంత్రి ఈ ఆరోపణలను ఖండించారు. విశ్వసనీయత ఉన్న కంపెనీలకే భూములు ఇచ్చామని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 99 పైసలకే కంపెనీలకు భూముల కేటాయింపుల అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 27 ఎకరాల భూమిని 99 పైసలకే ఇచ్చారని మంత్రిగారే చెప్పారని నారా లోకేష్ ప్రస్తావించారు. విశాఖపట్నంలో అమరావతి, హైదరాబాద్ కంటే తక్కువ ధరకే భూములు ఇస్తున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐటీ కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. వర్సా కంపెనీకి కూడా ఇదే విధంగా మూడు వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టాలని ప్రయత్నించారని లోకేష్ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధర.. ఇవాళ తులం ఎంతంటే

భారత్-అమెరికా డీల్‌పై మాట మార్చిన వైట్‌హౌస్

మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా అమెరికా వాడుకుంది.. పాక్‌ మంత్రి అసహనం

‘రాంగ్‌సైడ్‌’ డ్రైవింగ్‌పై పోలీసుల కొరడా..

ప్లాన్ B కాదు.. C, D కూడా రెడీ చేసిన స్టార్స్