ఏపీలో కూటమి బంధం 15ఏళ్ల పాటు కొనసాగుతుందా? బీజేపీ సెకండ్‌ థాట్‌తో ఉందా?.. సత్యకుమార్ ఏమన్నారంటే..

Updated on: Oct 26, 2025 | 12:01 PM

ఏపీలో కూటమి బంధం 15ఏళ్ల పాటు కొనసాగుతుందా? బీజేపీ సెకండ్‌ థాట్‌తో ఉందా? ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్‌ ప్లాంట్‌ అంశాలపై.. కాషాయనేతల మనసులో ఏముంది?.. ఇలాంటి సంచలన ఇష్యూస్‌పై టీవీ9 క్రాస్‌ ఫైర్ వేదికగా ఏపీ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయ్‌..

ఏపీలో కూటమి బంధం 15ఏళ్ల పాటు కొనసాగుతుందా? బీజేపీ సెకండ్‌ థాట్‌తో ఉందా? ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్‌ ప్లాంట్‌ అంశాలపై.. కాషాయనేతల మనసులో ఏముంది?.. ఇలాంటి సంచలన ఇష్యూస్‌పై టీవీ9 క్రాస్‌ ఫైర్ వేదికగా ఏపీ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయ్‌.. టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ సంధించిన ప్రశ్నలకు సత్యకుమార్ తనదైన శైలిలో మాట్లాడారు..

కూటమి కొనసాగింపుపై బీజేపీకి సెకండ్‌ థాట్‌ లేదని.. ఏపీలో కూటమి బంధం కొనసాగుతుందంటూ సత్యకుమార్ పేర్కొన్నారు. విభజన చట్టంలో ప్రత్యేకహోదా అంశం లేదన్నారు.. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోనే పోలవరం పూర్తవుతుందని స్పష్టంచేశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి కొత్తగా ఒనగూరేదేమీ లేదని తెలిపారు. పీపీపీపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం అని.. అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ ఏపీ మంత్రి సత్య కుమార్ వివరించారు.

దీంతోపాటు ఏపీలో కూటమికి సంబంధించి టీవీ9 క్రాస్‌ఫైర్‌లో సంచలన విషయాలు చెప్పారు మంత్రి సత్యకుమార్..  పూర్తి వీడియోను చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Oct 26, 2025 12:01 PM
Loading...
Unable to load recommendations.
Follow Us