BRS: కార్యకర్తలను వేధించేవారిని వదిలిపెట్టబోం – పోలీసులకు కేసీఆర్ హెచ్చరిక

Updated on: Apr 27, 2025 | 8:58 PM

కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆరోపించారు కేసీఆర్. అసలు పోలీసులకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. రాజకీయాలకు పోలీసులు ఎందుకు బలి అవుతారన్నారు. ప్రభుత్వం, పోలీసులు పెట్టే తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు కేసీఆర్. కార్యకర్తల కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ సిద్ధంగా ఉందన్నారు. ఇకపై తాను కూడా ఊరుకోనని కామెంట్ చేశారు. కొందరు పోలీసులు తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా కేసీఆర్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడంతో.. ఈ అంశంపై ఆ పార్టీ సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. 

కేసులకు భయపడేది లేదు. కార్యకర్తలను వేధించేవారిని వదిలిపెట్టబోం. ఇదీ రజతోత్సవ సభ వేదికగా పోలీసులను ఉద్దేశించి కేసీఆర్ చేసిన హెచ్చరిక. గులాబీ బాస్ వ్యాఖ్యలతో కేసుల విషయాన్ని బీఆర్ఎస్ నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఎల్కతుర్తి సభ వేదికగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వారియర్స్‌పై ఎందుకు కేసులు పెడుతున్నారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Loading...
Unable to load recommendations.
Follow Us