Telangana: సీఎం బస్సులో అణువణువూ చెక్ చేసిన కేంద్ర బలగాలు

Updated on: Nov 20, 2023 | 12:01 PM

ముఖ్యమంత్రి బస్సులో పోలీసుల తనిఖీలు చేశారు. కరీంనగర్‌ జిల్లా గుండ్లపల్లి టోల్‌గేట్‌ దగ్గర సోదాలు చేశారు. బస్సులో అణువణువూ చెక్‌ చేశాయి కేంద్ర బలగాలు. ప్రతి బ్యాగ్‌ను ఓపెన్‌ చేసి పరిశీలించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి బలగాలకు సీఎం సిబ్బంది పూర్తిగా సహకరించారు.  వీడియో చూడండి...

తెలంగాణ ఎన్నికల ప్రచారం మంచి జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ రోజూ రెండు, మూడు సభలతో రఫ్పాడిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి బస్సులో పోలీసుల తనిఖీలు చేశారు. కరీంనగర్‌ జిల్లా గుండ్లపల్లి టోల్‌గేట్‌ దగ్గర సోదాలు చేశారు. బస్సులో అణువణువూ చెక్‌ చేశాయి కేంద్ర బలగాలు. ప్రతి బ్యాగ్‌ను ఓపెన్‌ చేసి పరిశీలించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి బలగాలకు సీఎం సిబ్బంది పూర్తిగా సహకరించారు.

కాగా ఈ రోజు కేసీఆర్‌ భాగంగా ఇవాళ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us