BRS Public Meeting: తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఈ సభల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి చేసిన సేవలు, అభివృద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు.. విపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్.. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. సిర్పూర్ కాగజ్నర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా సిర్పూర్ లో కేసీఆర్ పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..