బీహార్ లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం వీడియో
బీహార్ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. అంతర్గత కలహాలపై అమిత్ షా విమర్శలు గుప్పించగా, తేజస్వి యాదవ్ ఉద్యోగాలు, అభివృద్ధి హామీలు ఇచ్చారు. బీజేపీ వర్తమానం గురించి మాట్లాడదని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. కీలక నేతల ప్రచారాలతో బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
బీహార్ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం మరింత తీవ్రంగా సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహాఘటబంధన్లో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయని విమర్శించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన వర్చువల్ గా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ, నితీశ్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచి బీహార్ ను ముందుకు తీసుకెళ్లాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.మరోవైపు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శివాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఉద్యోగాల కోసం, విద్యార్థులు కోచింగ్ ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని హామీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
