AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లోను అమల్లోకి రానున్న SIR ప్రక్రియ

తెలుగు రాష్ట్రాల్లోను అమల్లోకి రానున్న SIR ప్రక్రియ

Phani CH
|

Updated on: Feb 20, 2026 | 11:44 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. డూప్లికేట్ ఓట్లు, తప్పుడు చిరునామాలను తొలగించి, అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం ఈ ప్రక్రియ లక్ష్యం. ఏప్రిల్ నుండి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కానున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రక్రియను ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనకు “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (SIR) నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మూడో విడత SIR ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మొత్తం 18 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 2023 అక్టోబర్‌లో ప్రారంభమైన ప్రక్రియ కొనసాగుతుండగా, మిగిలిన రాష్ట్రాల్లో ఏప్రిల్ నుండి పనులు మొదలుపెట్టాలని ఈసీ స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్ లో రూ. 13 వేల కోట్ల ఆన్ లైన్ గేమింగ్ ఫ్రాడ్

ఆదాయం కోట్లలో.. పన్ను కట్టడం రూపాయల్లో

Suryapeta: దారుణం.. ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో

Follow Us