ఇక.. 2 గంటల్లోనే హైదరాబాద్‌ టు విజయవాడ

Updated on: Aug 07, 2025 | 6:50 PM

ఏపీకి కీలక హామీలు ఇచ్చారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ. ఆంధ్రప్రదేశ్‌లో 5, 233 కోట్ల రూపాయాల విలువైన జాతీయ రహదారులకు గడ్కరీ పచ్చజెండా ఊపారు. శనివారం మంగళగిరి సీ కన్వెన్షన్‌ వేదికగా శనివారం జరిగిన సమావేశంలో పాల్గొన్ని పలు రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మధ్య ఉన్న హైవేని ఆరులైన్ల గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే డీపీఆర్‌కి గడ్కరీ ఆదేశించారు.

ఇది పూర్తయితే ఈ నగరాల మధ్య గల ప్రయాణ దూరం 5 గంటల నుంచి 2 గంటలకు తగ్గుతుందని గడ్కరీ ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో ఏపీ రోడ్లు అమెరికా రోడ్లలా మెరిసిపోతాయన్నారు. చంద్రబాబు విజన్‌తో ఏపీ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని.. ఆయనెప్పుడూ ఫ్యూచర్‌ గురించే ఆలోచిస్తారన్నారు నితిన్‌ గడ్కరీ.. ఈ సందర్భంగా ఏపీలో చేపట్టబోయే భారీ ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ ప్రకటించారు. 6,700 కోట్లతో హైదరాబాద్‌- విజయవాడ రోడ్డు 6 లైన్లు, విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా ఆరు లైన్ల రోడ్డు – 2వేల600 కోట్లు, 2 వేల కోట్లతో వినుకొండ నుంచి గుంటూరు రోడ్డు విస్తరణ, గుంటూరు నారాకోడూరు రహదారి నాలుగు లేన్లుగా విస్తరణ, ఆకివీడు నుంచి దిగమర్రుకి కొత్త రహదారి, పెడన నుంచి లక్ష్మీపురం రహదారికి భారీగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రధాన హైవేలన్నీ కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ఆధ్వర్యంలోనే ఏర్పాటు అయ్యాయన్నారు సీఎం చంద్రబాబు. ఆయన వల్లే దేశంలోని రోడ్లు బాగున్నాయని కొనియాడారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు.. 84 % మందికి ఆ డిసీజ్

పెళ్లి ద్వారా గ్రీన్ కార్డ్ పొందటం.. ఇక ఈజీ కాదు

గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండా 3115 రైల్వే ఉద్యోగాల భర్తీ

‘దేవుడి దగ్గరికి వెళ్తున్నా..’ ఐదో అంతస్తు నుంచి దూకిన మహిళ

రోజుకు రూ. 411 కడితే.. చేతికి రూ.43 లక్షలు.. ఈ అదిరిపోయే స్కీమ్ ఏదంటే..