మల్లారెడ్డి యూనివర్సిటీలో శివరాత్రి జాగరణ కార్యక్రమం

Updated on: Feb 13, 2026 | 12:38 PM

మల్లారెడ్డి యూనివర్సిటీలో మహాశివరాత్రి సందర్భంగా భారీ జాగరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలు, వ్యాపారంతో పాటు ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించడం చర్చనీయాంశమైంది. 50 వేల మందితో సద్గురు శైలిలో సెట్టింగ్ వేసి ఈ వేడుకను జరిపారు. ఆయన ఆధ్యాత్మిక మార్పు మేడ్చల్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్ పొలిటీషియన్, మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయ, వ్యాపార రంగాలతో పాటు ఆధ్యాత్మిక రంగంలోనూ ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం భారీ సెట్ ఏర్పాటు చేసి, సుమారు 50 వేల మందితో శివరాత్రి జాగరణను జరిపారు. మల్లారెడ్డి సాధారణంగా చేసే కార్యక్రమాల్లో వైవిధ్యం ఉంటుందని, రాజకీయాలను కూడా ఆయన ఆస్వాదిస్తారని చెబుతారు. తన విద్యాసంస్థలను విస్తరిస్తున్న ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Lok Sabha: లోక్ సభ లో.. జగడ జగడ జగడం

విడిపోయాకే సంతోషంగా ఉన్నా.. బాధ లేని బంధం

టాలీవుడ్‌లో ఆ సినిమాలకు కష్ట కాలం.. పాపం

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు