కార్మికుల బతుకుల్ని చిదిమేస్తున్న బాణా సంచా తయారీ

Updated on: Mar 02, 2026 | 1:53 PM

భారతదేశంలో బాణాసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు కార్మికుల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. వేట్లపాలెం, నాగ్పూర్‌లలో జరిగిన విషాదాలు వ్యవస్థీకృత నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అనుమతి లేని యూనిట్లు, నిబంధనల ఉల్లంఘన, రక్షణ చర్యల కొరత వల్ల అనేక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పండుగల సీజన్లలో పెరుగుతున్న ఉత్పత్తి ఒత్తిడి, ఇరుకు గదుల్లో పనులు కార్మికులకు మృత్యువును ఆహ్వానిస్తున్నాయి.

భారతదేశంలోని బాణాసంచా తయారీ కేంద్రాలు నిరుపేద కార్మికుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి. పండుగల వెలుగుల కోసం జరిగే ఈ ఉత్పత్తి అనేక కుటుంబాల్లో అంతులేని చీకట్లను నింపుతోంది. మొన్న వేట్లపాలెంలో, నిన్న మహారాష్ట్రలోని నాగ్పూర్‌లో జరిగిన భీకర పేలుళ్లు వ్యవస్థీకృత నిర్లక్ష్యానికి నిదర్శనమని వాదనలు వినిపిస్తున్నాయి. కటోల్ ప్రాంతంలోని గన్ పౌడర్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో పదుల సంఖ్యలో కార్మికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. అనుమతులు లేని వందలాది తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా, అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. లైసెన్స్ పొందిన యూనిట్లు సైతం రక్షణ నిబంధనలను గాలికొదిలేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Donald Trump: ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ ను కూడా ధ్వంసం చేశాం

Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు

Gold-Silver Price: అంతర్జాతీయంగా భారీగా పెరుగుతున్న గోల్డ్ ధరలు

Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే

Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు

Loading...
Unable to load recommendations.
Follow Us