తేళ్ల పంచమి.. వాటిని ముఖంపై వేసుకుని ఆటలు.. వామ్మో ఇదేం పండుగ వీడియో
నాగుల పంచమి తెలుసు, నాగుల చవతి తెలుసు. ఈ తేళ్ళ పంచమి ఏంటి అనుకుంటున్నారా? అవును, కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా, కందుకూరు గ్రామంలో అనాదిగా ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమిగా జరుపుతారు. ఈరోజు భక్తులు పుట్టలో పాలుపోసి నాగదేవతను ఆరాధిస్తారు. కందుకూరు గ్రామంలో మాత్రం సమీపంలోని కొండపై ఉన్న కొండమేశ్వరి దేవిని కొలుస్తారు. అలాగే ఇక్కడ తేళ్ళ విగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం గుట్టపై ఉన్న రాళ్ళకోసం పరుగులు తీస్తారు. విశేషం ఏంటంటే ఇక్కడ ఏ రాయి తీసినా వివిధ రకాల తేళ్ళు దర్శనమిస్తాయి.
వాటితో ఈ శ్రావణ పంచమి రోజు ఆటలు ఆడుకుంటారు అక్కడికి వచ్చే భక్తులు. చిన్నా, పెద్దా తేడా లేకుండా తేళ్ళను తమ శరీరంపై ఎక్కించుకుంటారు. వాటితో ఆడుకుంటూ సరదాగా గడుపుతారు. అసలే తేళ్ళు విషపూరితం. అవి కరిస్తే ప్రమాదం కూడా అనుకోవచ్చు. అయితే దశాబ్దాలుగా జరుపుతున్న ఈ వేడుకల్లో ఏ నాడు ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదని భక్తులు చెబుతున్నారు. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే ఆ తేళ్ళు భక్తులకు హాని చేయమని భక్తుల నమ్మకం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు. ఇదే ఇక్కడి కొండమేశ్వరి అమ్మవారి ప్రత్యేకత అంటున్నారు. ఇలా ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు కందుకూరు కొండపై పెద్ద ఎత్తున తేళ్ళ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :