రైలు ప్రయాణికులకు అలర్ట్‌..

Edited By: TV9 Telugu

Updated on: Sep 17, 2025 | 5:57 PM

భారతీయ రైల్వేలు 2025 అక్టోబర్ 1 నుండి జనరల్ రిజర్వేషన్ టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నియమం టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన తొలి 15 నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది. తత్కాల టిక్కెట్లకు ఇప్పటికే ఆధార్ లింక్ తప్పనిసరి కాగా.. ఈ కొత్త నియమం ద్వారా అక్రమాలను నియంత్రించి నిజమైన ప్రయాణికులకు టిక్కెట్లు దొరకే అవకాశాలను మెరుగుపరుచుకోవాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కీలకమైన ప్రకటన చేసింది. 2025 అక్టోబర్ 1 నుండి జనరల్ రిజర్వేషన్ టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల టిక్కెట్లకు ఆధార్ లింక్ తప్పనిసరి అయినప్పటికీ ఈ కొత్త నిర్ణయంతో జనరల్ కోటా టిక్కెట్ల బుకింగ్‌లోనూ ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. ఈ కాల వ్యవధిలోనే అధిక డిమాండ్ ఉండటం, అక్రమాలను నివారించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం. ప్రయాణికులు అక్టోబర్ 1 లోగా తమ IRCTC ఖాతాకు ఆధార్‌ను లింక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తుంది.

Published on: Sep 17, 2025 04:45 PM