Chinna Jeeyar Swamy: భారతీయులమైనందుకు గర్వపడాలి.. చిన్న జీయర్ స్వామి పంద్రాగస్టు సందేశం

Updated on: Aug 15, 2023 | 8:13 PM

77th Independence Day: భారత పౌరులమైనందుకు మనం గర్వపడాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి అన్నారు. దేశంలోని అందరూ కలిసి కట్టుగా స్వాతంత్ర దినోత్సవం, యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.  అందరిలోనూ ఒక కుటుంబ భావన కలిగించేదిగా స్వాతంత్ర దినోత్సవ వేడుక ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 

దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు మిన్నంటాయి. పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు, విదేశీ అధినేతలు భారత పౌరులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు జెండా పండుగ విషెస్ తెలిపారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి. భారత పౌరులమైనందుకు మనం గర్వపడాలని అన్నారు. దేశంలోని అందరూ కలిసి కట్టుగా స్వాతంత్ర దినోత్సవం, యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.  అందరిలోనూ ఒక కుటుంబ భావన కలిగించేదిగా స్వాతంత్ర దినోత్సవ వేడుక ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us