Video: తెల్లారి గుడికొచ్చిన పూజారి కళ్లెదుట ఊహించని సీన్.. ఆ తర్వాత జరిగిందిదే

Updated on: Oct 12, 2024 | 6:25 PM

రోజూలానే తెల్లారి గుడికొచ్చాడు పురోహితుడు. దేవుడి ప్రతిమలను శుభ్రం చేసి పూజకు సిద్దం చేయాలని అనుకున్నాడు. అయితే అతడి కళ్లెదుట ఊహించని సీన్ ఎదురైంది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రెంకొని వాగు దగ్గర ఉన్న నల్లపోచమ్మ గుడిలో రాత్రి దొంగలు పడ్డారు. ఉదయం పురోహితుడు పూజకు వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం చూసి అవాక్ అయ్యాడు. అమ్మవారి మీద ఉన్న నగలు పుస్తెలతాడు, హారం ఒరిజినల్ బంగారం అనుకుని అర్నమెంట్ నగలను, 2 తులాల వెండి విగ్రహాలు, ఇత్తడి నవగ్రహాలు, అమ్మవారి చీరెలను దోచుకెళ్లారు. సుమారు 30 వేలు రూపాయలు విలువ ఉంటాయని పురోహితుడు తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us