శక్తిపీఠంలో తెగిన రోప్వే.. ఆరుగురు దుర్మరణం
గుజరాత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో విషాద ఘటన జరిగింది. పంచమహల్ జిల్లాలోని పావగఢ్ శక్తిపీఠంలో రోప్వే తీగ తెగిపోవడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. పావగఢ్ కొండపైకి సరుకు రవాణాచేసే కార్గో రోప్వే తెగిపడటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. సెప్టెంబరు 7 ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు లిఫ్ట్మన్లు, ఇద్దరు కార్మికులతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పంచమహల్ జిల్లా ఎస్పీ ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ఉదయం నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్యాసింజర్ రోప్వే సేవలను ముందే నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కేవలం సరకు రవాణా రోప్వేలో మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు. సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉన్న మహాకాళి అమ్మవారి శక్తిపీఠానికి ఏటా 25 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ప్రమాద వార్త తెలియగానే భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాంకేతిక కారణాలతోనే ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ తర్వాతే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని ఎస్పీ వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఛాతిలో కత్తి.. అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చిన బాలుడు.. పోలీసులు షాక్
భారీ వరదలో చిక్కుకున్న బస్సులు.. భయంతో ప్రయాణికుల ఆర్తనాదాలు
చిట్టీలు కడుతున్నారా? ఇలాంటివారు ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త