Nirmal: వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ లోపల సీన్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది

Updated on: Oct 12, 2024 | 6:08 PM

వేసిన తాళం వేసినట్టే ఉంది. కానీ ఆఫీస్ నుంచి తిరిగి రాగానే సీన్ మారిపోయింది. లోపలకెళ్లి చూస్తే దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడలో గల తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. మూడు తులాల బంగారం, ఐదు తులాల వెండి, రూ. 2500 నగదును ఎత్తుకెళ్లారు దొంగలు. వేసిన తాళం వేసినట్టే ఉంది. కానీ లోపల మాత్రం సీన్ మారిపోయింది. తెలివిగా డబ్బు, బంగారం, వెండితో ఉడాయించారు దొంగలు. ఆఫీసు నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉందని.. అయితే రాత్రి వచ్చేసరికి మాత్రం నగదు మయమైందని బాధితురాలు వాపోయింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us