Venu Swamy: వేణు స్వామికి ఘోర అవమానం.. గుడి నుంచి గెంటేసిన అర్చకులు

Updated on: Aug 22, 2025 | 8:45 PM

సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణు స్వామికి ఘోర అవమానం జరిగింది. ఓ అర్చకుడు ప్రఖ్యాత కామాఖ్య దేవి ఆలయం నుంచి ఆయన్ను గెంటేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. వేణు స్వామిని మరో సారి నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! ఆగస్టు 20 వేణు స్వామి.. అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించుకోవడనికి వెళ్లారు.

అయితే ఏమైందో తెలీదు కానీ.. అక్కడి అర్చకులు వేణుస్వామిని అడ్డుకున్నారు. గుడి లోపలకు రాకుండా బయటకు పంపించేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. రీసెంట్‌గా కామాఖ్య ఆలయం పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సంతానం లేనివారు కామాఖ్యా అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే.. ఏడాదిలోపు పిల్లలు పుడతారని వేణు స్వామి జోస్యం చెప్పాడు. అంతేకాదు అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పిస్తాంచాలన్నాడు. దీంతో వేణు స్వామిపై ఆలయ పండితులు గుర్రుగా ఉన్నారు. అమ్మవారి ఆలయం గురించి అపచారపు మాటలు మాట్లాడడం సరికాదని ఇది వరకే వేణు స్వామిని పండితులు హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలతో విమర్శల పాలయ్యాడు. ఈ క్రమంలోనే వేణు స్వామి కామాఖ్య ఆలయంలో కనిపించే సరికి ఆలయ సిబ్బందితో పాటు.. ఆలయ అర్చకులు ఆయన్ను అడ్డకున్నారు. అలాగే వేణు స్వామి లక్షల్లో డబ్బులు తీసుకుని ఇక్కడ పూజలు నిర్వహించడంపై కూడా కామాఖ్య ఆలయ సిబ్బంది ఆగ్రహానికి మరో కారణమని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోపంగా ఉన్న ఫ్యాన్స్‌ను.. చిరు లీక్‌తో కూల్ చేసిన మెగాస్టార్

Sitara Ghattamaneni: అభిమానులకు.. మహేష్ కూతురు హెచ్చరిక

మరీ దారుణం.. కలిచివేస్తున్న కమెడియన్ కథ!

Samantha: పిచ్చెక్కించిన సమంత ‘కానీ ఇంత ఓవర్ అవసరమా..’ అన్నదే టాక్

Mokshagna: మోక్షు ఎంట్రీపై సస్పెన్స్‌ పోయినట్టే ఇక!