వెండితెరపై రూల్స్ మార్చేస్తున్న కొత్త ట్రెండ్
గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమా ఫార్మాట్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. పాత కమర్షియల్ ఫార్ములాలు మారి, కొత్త తరం దర్శకులు కథా ప్రధాన చిత్రాలను రూపొందిస్తున్నారు. పాటలు, పోరాటాల సంఖ్య తగ్గింది, సీక్వెల్స్, సినిమా నిడివి పెరిగాయి. ఈ పరిణామాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి.
గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమా రంగం కీలక పరిణామాలను చూసింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్ తప్పనిసరిగా ఉండాలనే నియమం ఉండేది. ఇది జానర్ ఏదైనా పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాకు టెంప్లేట్గా భావించబడేది. అయితే, గత పదేళ్లలో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా కొత్త తరం దర్శకులు సినిమా ఫార్మాట్ను సమూలంగా మార్చేశారు. సినిమా కథకు ఆటంకం అని భావిస్తే పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ను పూర్తిగా పక్కన పెడుతున్నారు. కథా ప్రవాహానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సీక్వెల్స్ ట్రెండ్ కూడా పెరిగింది, ఒకే కథను రెండు, మూడు భాగాలుగా తీసి నిర్మాతలకు డబుల్ లాభాలు తెచ్చిపెడుతోంది.
Published on: Apr 02, 2026 02:44 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత

