బాలీవుడ్‌లో హారర్‌ మూవీ, రామ్ గోపాల్ వర్మ బౌన్స్ బ్యాక్ అవుతారా

Updated on: Oct 27, 2025 | 8:27 PM

కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్‌లో కొత్త హారర్‌ సినిమాతో పుంజుకునేందుకు సిద్ధమవుతున్నారు. మనోజ్ బాజ్ పాయ్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పోలీస్ స్టేషన్ మే భూత్ చిత్రంతో తన స్టైల్‌ను మార్చుకుని, తిరిగి సంచలనాలు సృష్టించాలని వర్మ ఆశిస్తున్నారు. ఇది ఆయనకు బ్రాండ్ తిరిగి తెచ్చే ప్రయత్నం.

కొన్నేళ్లుగా వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్‌ను మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇండియన్ సినిమాకు కొత్త దారులు చూపించి, సంచలనాత్మక చిత్రాలను రూపొందించిన వర్మ, గత పదేళ్లుగా ప్రేక్షకులను నిరాశపరుస్తూ వస్తున్నారు. కనీసం ఆమోదయోగ్యమైన ప్రాజెక్ట్ కూడా ఆయన నుంచి రాలేదు. తాజాగా, “నేను మారాను” అంటూ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చిన వర్మ, ఇప్పుడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తన మార్క్ హారర్ కాన్సెప్ట్‌తో బాలీవుడ్‌లో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ హారర్ చిత్రానికి పోలీస్ స్టేషన్ మే భూత్ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటులు మనోజ్ బాజ్ పాయ్, జెనీలియా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే ??

ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

తరుముకొస్తున్న మొంథా తుఫాన్‌.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్

నాగపంచమి వేళ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

ప్రైవేట్ బస్సులంటేనే హడల్‌.. ఆర్టీసీకి పెరిగిన ఆదరణ