ఆగస్ట్ 1 తర్వాత ఈ సూపర్ హిట్ సినిమాలను.. OTTల్లో చూడలేరు..

Updated on: Jul 05, 2025 | 12:00 PM

సాధారణంగా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి వస్తాయి. సూపర్ హిట్ సినిమాల విషయంలో ఈ టైమ్ కాస్త ఎక్కువ కావొచ్చు. అయితే సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా స్ట్రీమింగ్ చేయడానికి సంబంధిత ఓటీటీ ప్లాట్ ఫామ్ దగ్గర ఓ నిర్దిష్ట గడువు ఉంటుంది. ఈ గడువు ముగిసిన వెంటనే సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆ సినిమాను తమ స్ట్రీమింగ్ లిస్ట్ నుంచి కచ్చితంగా తొలగించాలి.

దీనికి సంబంధించి ఓటీటీ సంస్థలు, సినిమా నిర్మాతలు ముందే డీల్ కుదర్చుకుంటారు.దీంతో పాటు, సినిమాకు డిమాండ్ తగ్గిన వెంటనే, లేదా కొత్త కంటెంట్‌కు చోటు కల్పించడానికి, లేదా నిర్మాత.. పంపిణీదారు మధ్య ఒప్పందం మారిన తర్వాత, లేదా ఏవైనా చట్టపరమైన సమస్యల కారణంగా OTT నుంచి సినిమాలు, వెబ్ సిరీస్ లను తొలగించే అవకాశముంది. ఇప్పుడు ఇవే నిబంధనలు, నియమాల కారణంగా ఆగస్టు 01 తర్వాత కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఓటీటీల నుంచి మాయం కానున్నాయి. మరి అవేంటో తెలుసుకుని ఈ లోగానే చూసేయండి.. ! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘రాజీ’. ఈ మూవీ ఆగస్టు 5 వరకు మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మీరు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడలేరు. అక్షయ్ కుమార్ సినిమా ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ కూడా ఈ జాబితాలో ఉంది. ఆగస్టు 1వ తేదీకి ముందు మీరు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడాలి. ఆ తర్వాత ఆ సినిమా ఓటీటీ నుండి తీసివేయనున్నారు. అజయ్ దేవగన్, శ్రియ జంటగా నటించిన ‘దృశ్యం’ సినిమా చాలా మందికి ఫేవరెట్. ఆగస్టు 1 తర్వాత మీరు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడలేరు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్పూన్‌ మింగేశాడు.. ఆర్నెల్ల తర్వాత వైద్యపరీక్ష చేయగా..

ఓ వైపు భూకంపం.. మరో వైపు తిండి యావ.. బుడతడు చేసిన పని చూస్తే మైండ్ బ్లాకే

జాలరి పంట పండింది పో.. వలలో పడింది చూసి మైండ్ బ్లాక్

కేరళ నరమేధంపై ఒళ్లు గగుర్పొడిచే ఫిల్మ్..! డోంట్ మిస్ ఇట్ !

Samantha: ’18 ఏళ్లకే ప్రేమ.. తనే భర్తంటూ టాటూ..’ తన ఫస్ట్ లవ్‌ స్టోరీ చెప్పి షాకిచ్చిన సామ్