Nikhil Siddhartha: వెయ్యి మంది పిల్లలంటే మాటలు కాదు.. నిజంగా నిఖిల్ చాలా గ్రేట్!
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో దాదాపు వెయ్యి మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్, స్టేషనరీ కిట్లు అందజేశారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిఖిల్, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో కొనసాగిస్తానని తెలిపారు.
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకున్నాడు. సామాజిక స్పృహ మెండుగా ఉన్న ఈ హీరో మరో సారి తన మంచి మనసు చాటుకున్నాడు. దాదాపు 1000 మంది స్కూల్ పిల్లలకు అవసరమైన స్టడీ మెటీరియల్, బుక్స్ అఖిల్ అందజేశారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో అఖిల్.. ఈ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈయన స్వయంగా వెళ్లి మరీ విద్యార్థులకు స్డడీ మెటీరియల్ అందించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడిన అఖిల్.. ‘ఒక నటుడిగా స్క్రీన్ మీదే కాదు.. సొసైటీకి ఏదో ఒకటి రిటర్న్ ఇవ్వాలన్నదే తన ప్రయత్నం అన్నాడు. అందులో భాగంగానే 1వ తరగతి నుంచి 5వ తరగతి ఎలిమెంట్రీ స్కూల్ వరకే దాదాపు వెయ్యి మంది పిల్లలకు స్టేషనరీ కిట్స్, చదువుకోవడానికి కావాల్సిన ఒక గిఫ్ట్ యాంపర్స్ ఇచ్చా అన్నాడు. ఇంతకు ముందు ఇలాంటి కార్యక్రమాలు కేవలం హైదరాబాద్లో చేసే వాడినని.. ఇప్పుడు అన్నీ ప్రాంతాల్లో చేయాలనుకుంటున్నట్టు అఖిల్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
B. V. Nandini Reddy: జాక్పాట్ కొట్టిన నందినిరెడ్డి..ఈసారి బాలీవుడ్ పై గురి!
Lenin Review: అయ్యగారి ప్రోగ్రెస్ కార్డ్ ! లెనిన్ హిట్టా.. ఫట్టా..?
