‘బాగా పొగరు’.. నిత్యా చేసిన పనిపై నెటిజన్స్ మండిపాటు

Updated on: Jan 12, 2025 | 12:44 PM

తెలుగు సినీ ప్రియులకు హీరోయిన్ నిత్యా మీనన్ సుపరిచితమే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా హీరోయిన్ నిత్యా మీనన్ తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఓ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో పీఆర్ఓ స్టేజ్ పై చేయి అందించగా.. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిత్యా మీనన్ ఇష్టపడలేదు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆమె నుంచి ఇది అసలు ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో స్టేజ్ పైకి నిత్యా మీనన్ రావడంతో ఆమెకు స్వాగతం చెబుతూ అక్కడే ఉన్న పీఆర్ఓ నిత్యాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అతడు చేయి చాపినా నిత్యా కరచాలనం చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నిత్యాపై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. బాగా పొగరు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పవన్‌, నాగబాబు.. ఇంట్లో ఏం చేసేవారో బయటపెట్టిన చరణ్‌

Loading...
Unable to load recommendations.
Follow Us