సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ స్విమ్మింగ్ పోటీల్లో రికార్డు సృష్టించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో టాప్ 8 ఈతగాళ్ళ లిస్టులో స్థానం సంపాదించాడు గౌతమ్. 15 ఏళ్ల వయసులోనే గౌతమ్ ఈ ఘనత సాధించడం పట్ల చాలా గర్వంగా ఉందని.. మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. Goutham Gattamaneni.2018లోనే గౌతమ్ ఫ్రొఫెషనల్ స్విమ్మర్ గా మారాడని.. అప్పటినుంచి స్విమ్మింగ్ లో సత్తా చాటుతున్నాడని ఆమె పేర్కొంది. బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొట్టగల గౌతమ్.. 3 గంటల్లో 5 కిలోమీటర్లు ఈదగలడని చెప్పుకోచ్చింది. గౌతమ్ కు ఫ్రీ స్టైల్ అంటే చాలా ఇష్టమని నమ్రత చెప్పింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Rangareddy child death Video: వాటర్ ట్యాంక్లో శవమై తేలిన రెండేళ్ల పసిబాలుడు.మనసును కదిలించే వీడియో .