Mahesh Babu: కావాలంటే నా పాస్‌ పోర్టు చూపిస్తానంటున్న మహేష్‌… అసలేం జరిగింది

Updated on: Feb 17, 2026 | 7:05 PM

టాలీవుడ్‌ స్టార్స్‌ మహేష్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం విదేశాల్లో కీలకమైన షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన సినిమా కోసం తారక్‌ జోర్డాన్‌కు వెళ్లగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి చిత్రం షూటింగ్‌ నిమిత్తం మహేష్‌ జార్జియాకు పయనమవుతున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రాల కోసం వీరిద్దరూ బిజీగా ఉన్నారు.

మొన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ జోర్డాన్‌కు వెళ్లగా, ఇప్పుడు మహేష్‌ బాబు జార్జియా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరూ విదేశాలకు సరదా పర్యటనలకు వెళ్లడం లేదని, సినిమాల షూటింగ్‌ కోసమే వెళ్తున్నారని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న తమ చిత్రాల కోసం ఈ స్టార్‌ హీరోలు శరవేగంగా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ జోర్డాన్‌లో ఉన్నారు. నీల్‌ అండ్‌ టీమ్‌ అక్కడ అద్భుతమైన లొకేషన్లను గుర్తించి, కొన్ని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. వార్ 2 చిత్రం తర్వాత తారక్‌ నటిస్తున్న ఈ సినిమాపై అందరి దృష్టి ఉంది. జోర్డాన్‌లో రుక్మిణి వసంత్‌తో కలిపి కొన్ని సన్నివేశాలను ప్లాన్‌ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Raashii Khanna: రియల్ లైఫ్ లో పెద్ది డైలాగ్ ను ప్రాక్టీస్ చేస్తున్న రాశీ

Mrunal Thakur: అది అంత జోక్.. ఏప్రిల్ ఫూల్ అంటున్న మృణాల్

Suriya: స్ట్రాంగ్ లైనప్ ప్లాన్ చేసుకుంటున్న సూర్య.. ఈ సారి కొట్టే దెబ్బ అదుర్సే

Kriti Sanon: గ్లోబల్ ట్రెండ్ ను ఫాలో అవుతున్న కృతి సనన్

Top 9 ET: రష్మిక, విజయ్ పెళ్లి కార్డు బయటికి వచ్చింది.. ఎలా ఉందో మీరు ఓ లుక్ వేయండి

Follow Us