హీరోయిన్కు వింత రోగం.. చెప్పుకోలేక.. భరించలేక తీవ్ర ఇబ్బంది
సినిమా సెలబ్రిటీలది లగ్జరీ లైఫ్.. వాళ్లకు ఎలాంటి సమస్యలు ఉండవనుకుంటారు చాలా మంది. అయితే ఇది చాలా తప్పు. వారు కూడా మనుషులేగా...! అందరిలాగే వారికి సమస్యలు ఉంటాయి. అందులోనూ గంటల తరబడి కెమెరా లైట్ల ముందు, మేకప్ ఇతర కాస్ట్యూమ్స్ తో ఉండే వారికి ఏవో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ భూమి పడ్నేకర్ కూడా తనో వింత సమస్యతో బాధపడుతున్నట్టు రివీల్ చేసింది. తనకున్న వ్యాధి గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. భూమి ఎగ్జిమా అంటే వాడుక బాషలో తామర అనే చర్మ వ్యాధితో బాధపడుతోందట. ఇది మూడేళ్ల క్రితమే నిర్ధారణ అయిందని.. తాను ఎక్కువగా ప్రయాణించినప్పుడల్లా, పోషకాహారం తీసుకోకపోయినా లేదా అధిక ఒత్తిడిని అనుభవించినా చర్మంపై దద్దుర్లు రావడం విపరీతంగా దురదలు వస్తాయని భూమి పేర్కొంది. దీని కారణంగా తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ సమస్య గురించి అందరికీ అవగాహన కల్పిస్తానని, అలా ప్రజలు దీనిని సకాలంలో అర్థం చేసుకుని చికిత్స పొందుతారని భూమి తన పోస్ట్లో రాసుకొచ్చింది. ఇక ఎగ్జిమాను అటోపిక్ డెర్మటైటిస్ అని కూడా పిలుస్తారు. దీని కారణంగా చర్మంపై దురద, పొడిబారడం, మంట, ఎర్రటి మచ్చలు వంటివి వస్తాయి. ఇది అంటువ్యాధి కాదు, అంటే ఇది స్పర్శ ద్వారా వ్యాపించదు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీర రోగనిరోధక వ్యవస్థ అలెర్జీ కారకానికి అతిగా స్పందించినప్పుడు ఈ సమస్య వస్తుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం ఎగ్జిమా లేదా తామర అనేక కారణాల వల్ల వస్తుంది. పెర్ఫ్యూమ్లు లేదా రసాయన ఉత్పత్తులను అధికంగా ఉపయోగించడం, దుమ్ము , వాతావరణంలో ఆకస్మిక మార్పులు, ఎక్కువ వేడి, అలాగే చెడు ఆహారపు అలవాట్లు, అధికి ఒత్తిడి మరియు నిద్ర లేకపోవడం ఇలా ఎగ్జిమా రావడానికి చాలా కారణాలున్నాయి. ఈ క్రమంలో భూమి పెడ్నేకర్ కూడా విపరీత ప్రయాణాలు, అనారోగ్యకరమైన ఆహారం, తీవ్రమైన ఒత్తిడుల కారణంగానే ఎగ్జిమా బారిన పడ్డానంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
HCA సెలక్షన్ కమిటీ సభ్యులపై కేసు నమోదు
గాయం చేసేదీ వాళ్లే! సాయం అందించేదీ వాళ్లే
దడ పుట్టిస్తున్న బంగారం ధర.. బుధవారం తులం ఎంతంటే?
