సంక్రాంతికి మాత్రమే ఆడియన్స్ వస్తారా..? పండగ తర్వాత కళ తప్పిన బాక్సాఫీస్
సంక్రాంతికి మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారనే ఆందోళన టాలీవుడ్లో పెరుగుతోంది. పండుగ తర్వాత బాక్సాఫీస్ కళ తప్పింది. గత నెలలో విడుదలైన దాదాపు 20 సినిమాలు ఆడియన్స్ను మెప్పించలేకపోయాయి. ఆకట్టుకునే సినిమాలు రూపొందించాల్సిన బాధ్యత దర్శకనిర్మాతలపై ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. స్టార్ హీరోల చిత్రాల కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది.
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్ కళ తప్పడం నిర్మాతల ఆందోళనకు కారణమవుతోంది. సంక్రాంతికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని, పండుగ తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలు రాకపోవడమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. గత సంక్రాంతికి “అనగనగా ఒక రాజు”, “నారీ నారీ నడుమ మురారి” వంటి చిత్రాలను కుటుంబ ప్రేక్షకులు ఆదరించారు. అయితే, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద హిట్ నమోదు కాలేదు. గత నెల రోజుల్లో విడుదలైన దాదాపు 20 చిత్రాలలో “ఓం శాంతి శాంతి”, “యూఫోరియా”, “ఫంకీ” వంటివి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మలయాళంలో సీక్వెల్స్ పై భారీ క్యూరియాసిటీ.. రెండు సూపర్ ప్రాజెక్టులపై సస్పెన్స్
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
మళ్లీ సంక్రాంతికి చూసుకుందాం.. సరిపోయారిద్దరు
Allu Arjun: అల్లు అర్జున్ అసాధ్యుడే.. ఆ ప్లానింగ్ ఏంటి బన్నీ
Vishnu Vinyasam: కామెడీతో విన్యాసాలు చేస్తున్న కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్