Gold Price: మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు

Updated on: Sep 08, 2025 | 9:32 PM

షేర్‌‌ మార్కెట్‌ నుంచి బులియన్‌ మార్కెట్‌కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ ఓవైపు.. బంగారం ధర ఇంకా పెరుగుతుందన్న అంచనాలతో డిమాండ్‌ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి. కాగా, సెప్టెంబర్ 8 2025న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

సెప్టెంబర్ 8, సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,08,490గా ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర రూ.99,450గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,38,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల బంగార ధర 1,08,530, 22 కేరట్ల ధర రూ.99,500లుగా ఉంది. ముంబైలో 24 కేరట్ల బంగార ధర 1,08,380, 22 కేరట్ల ధర రూ.99,350లుగా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,08,770 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.99,700గా ఉంది. కోల్‌కతాలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,08,480 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.99,440గా ఉంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 10 డాలర్ల మేర దిగివచ్చింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర 3585 డాలర్ల వద్దకు తగ్గింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.48 శాతం మేర తగ్గింది. దీంతో ఔన్స్ వెండి 40.78 డాలర్ల వద్దకు దిగివచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దిగంబర ముఠా అరాచకాలు.. గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ

ఏఐ రంగంలో ఉద్యోగాలు కావాలా? ఓపెన్ ఏఐ సంచలన ప్రకటన

శక్తిపీఠంలో తెగిన రోప్‌వే.. ఆరుగురు దుర్మరణం

ఛాతిలో కత్తి.. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలుడు.. పోలీసులు షాక్

భారీ వరదలో చిక్కుకున్న బస్సులు.. భయంతో ప్రయాణికుల ఆర్తనాదాలు