బీఎస్ఎన్ఎల్ సరికొత్త చౌక ప్లాన్.. రూ. 225కే అపరిమిత డేటా, కాలింగ్

Updated on: May 15, 2026 | 12:51 PM

ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలు పెంచుతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సామాన్యులకు ఊరటనిచ్చే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.225కే రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు పూర్తి 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ డేటా కోరుకునే విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు ఈ ప్లాన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ప్రైవేట్ టెలికాం సంస్థల ధరల పెరుగుదల నేపథ్యంలో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సామాన్యులకు ఊరటనిచ్చేలా సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 225 ధరతో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్, డేటా ఎక్కువగా వాడే యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ ప్లాన్ ద్వారా నెలకు సుమారు 75 జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. రోజుకు 2.5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే నెలకు సుమారుగా 75 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ఇక వ్యాలిడిటీ విషయానికి వస్తే.. ప్రైవేట్ సంస్థలు 28 రోజుల వ్యాలిడిటీ ఇస్తుండగా, బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ద్వారా పూర్తి 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ మాట్లాడుకునే సౌకర్యం, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి, ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు తక్కువ ధరలో ఎక్కువ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ ఒక వరం లాంటిది. రోజువారీ కోటా ముగిసిన తర్వాత కూడా తక్కువ వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్‌ను ఆధునీకరిస్తున్న తరుణంలో, ఈ చవకైన ప్లాన్ కస్టమర్లను భారీగా ఆకర్షిస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలో ఈ ఒక్క చోట మాత్రం ప్రతీ రాత్రి ఉరుములు మెరుపులే

బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయాన్నే ఓ గ్లాస్ తాగితే చాలు

తెలంగాణాలోని మగవారిలో కొత్త టెన్షన్.. దేశంలో ఇక్కడే ఆ సమస్య ఎక్కువ!

మధురఫలం.. విషపూరితం.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న వ్యాపారులు

డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు

Follow Us