మరో ‘దృశ్యం’తో మ‌రోసారి వెంకీ మెస్మ‌రైజ్ చేస్తారా..?

టాలీవుడ్ అగ్ర‌హీరో వెంకటేశ్​కు  ప్ర‌స్తుతం మంచి క‌థల‌పై ఫోక‌స్ పెట్టారు. చేతిలో సినిమాలు ఉన్నప్ప‌టికీ ఆయ‌న స్టోరీల కోసం వెతుకులాట ఆప‌డం లేదు. తాజాగా ఈ సెర్చింగ్ కి ఓ కామా పెట్టిన‌ట్లు తెలుస్తోంది. 

మరో 'దృశ్యం'తో మ‌రోసారి వెంకీ మెస్మ‌రైజ్ చేస్తారా..?
Follow us

|

Updated on: Jul 10, 2020 | 5:16 PM

టాలీవుడ్ అగ్ర‌హీరో వెంకటేశ్​కు  ప్ర‌స్తుతం మంచి క‌థల‌పై ఫోక‌స్ పెట్టారు. చేతిలో సినిమాలు ఉన్నప్ప‌టికీ ఆయ‌న స్టోరీల కోసం వెతుకులాట ఆప‌డం లేదు. తాజాగా ఈ సెర్చింగ్ కి ఓ కామా పెట్టిన‌ట్లు తెలుస్తోంది.  ఇప్పటికే వెంకీ వ‌ద్ద‌ మూడు సినిమాలు ఉన్నాయి. ప్ర‌జంట్ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అదికాక‌..తరుణ్‌ భాస్కర్‌, అనిల్‌ రావిపూడిల చిత్రాలు వ‌రుస‌లో ఉన్నాయి. వీటికి సంబంధించిన స్టోరీలు ఇప్పటికే ఫైన‌ల్ అయిన‌ట్లు సమాచారం. ఇప్పుడు ఈ లిస్ట్ లో ‘దృశ్యం 2’ చేరే అవకాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్‌ – మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ మలయాళంలో సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. జీతూ జోసెఫ్ డైరెక్ష‌న్లో వ‌చ్చిన‌ ఆ సినిమాను.. తెలుగులో అదే పేరుతో వెంకటేష్‌, మీనాలతో రీమేక్ చేయ‌గా ఇక్కడా సూప‌ర్ హిట్ట‌య్యింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సీక్వెల్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచన అప్పట్లో రెండు ఇండస్ట్రీల‌లోనూ వినిపించింది. తాజాగా మలయాళంలో ‘దృశ్యం 2’ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లారు డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్‌. ఇందులోనూ మోహన్‌లాల్​ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే ఈ సీక్వెల్‌ కథ ప్రారంభించ‌నున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ సీక్వెల్ విజ‌యం సాధిస్తే తెలుగులోనూ ‘దృశ్యం 2’ రీమేక్‌కి ముహూర్తం కుదిరే అవ‌కాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే వెంకటేష్‌కు మరో హిట్​ కొట్టిన‌ట్లే అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. ఇది ముందుకు వెళుతుందా? లేదా? అన్నది మలయాళ ‘దృశ్యం-2’ రిజ‌ల్ట్ పైనే ఆధారపడి ఉంటుంది.