టీడీపీలో చేరిన వంగవీటి రాధా

విజయవాడ: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఇటీవలే వైసీపీని వీడిన రాధా ఐదు నెలల తర్వాత టీడీపీలో చేరారు. పార్టీలో చేరడానికి ముందు సోమవారం చంద్రబాబుతో రాధా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మంగళవారం మరోసారి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. బుధవారం రాత్రి […]

టీడీపీలో చేరిన వంగవీటి రాధా
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2019 | 9:32 PM

విజయవాడ: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంగవీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఇటీవలే వైసీపీని వీడిన రాధా ఐదు నెలల తర్వాత టీడీపీలో చేరారు.

పార్టీలో చేరడానికి ముందు సోమవారం చంద్రబాబుతో రాధా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మంగళవారం మరోసారి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. బుధవారం రాత్రి పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్బంగా రాధా అభిమానులు, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున చంద్రబాబు నివాసానికి తరలి వచ్చారు.